పుట:దశకుమారచరిత్రము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

59

     ననిన మాతంగకుఁడు పతియనుమతమున
     వనజలోచనఁ బ్రీతి వివాహమయ్యె.31
వ. ఇత్తెఱంగున శరీరశుద్ధియు నుత్తమాంగనాసాంగత్యంబును
     రసాతలరాజ్యంబునుం బడసి మాతంగకుండు పరమానం
     దంబునం బొంది రాజవాహననరవల్లభునకుఁ బ్రియం బెఱిం
     గించి తానును నమ్మానినియు వివిధసంభాషనావిశేషంబులఁ
     దోషితుం జేయుచుండఁ గొండొకకాలంబున కవ్విభుండు
     చెలుల వంచించి వచ్చుటం జేసి తద్దర్శనకుతూహలం
     బునం బోవ సమకట్టి యిత్తెఱంగు వారల కెఱింగించిన నతం
     డునుం దనకుఁ గాళి కానుక యిచ్చిన మాణిక్యంబు పరిభవ
     క్షుత్పిపాసాదిక్లేశాపనోదం బగుట యవ్వనితవలన వినుటం
     జేసి యమ్మణి మానవేశ్వరున కొసంగం దలంచి తత్ప్రభావం
     బుపన్యసించి సకలరత్నంబులకును రాజు లొడయలు గావున
     దేవర దీనిఁ బరిగ్రహింపవలయు నని ప్రార్థించి యిచ్చి పాతా
     ళభువనంబు వెలువడ ననిచి వీడ్కొని మరలె ధరణీశ్వరుం
     డును సవితర్కంబుగా నొక్కరుండ యరిగి యెదురఁ
     బుష్పోద్భవుం గని సంభ్రమంబున గాఢాలింగనంబు సేసి
     యతని సవినయప్రణతి నాదరించి సమీపతరుచ్ఛాయా
     శీతలతలంబునందు నాసీనుం డై హర్షవికసితాననుం డగుచు
     నిట్లనియె.32
క. ఎఱిఁగినఁ బోనీ రని మిము
     మొఱఁగి మహీసురవరార్థముగఁ బోయితి నం
     దఱు నాతెఱఁ గేమని మది
     నెఱిఁగితి రెబ్భంగి నిశ్చయించితి రచటన్.33