ద్వితీయాశ్వాసము
45
తే. అకట! రత్నోద్భవుం డిటు లగునె దైవ
మిట్లు సేయునె యని తనయిచ్చ దూర
వగచియును వానితనయుండు వచ్చి తన్నుఁ
జేరుటకు నెంతయును సంతసిల్లి విభుఁడు.98
వ. అక్కుమారుని గైకొని సుశ్రుతుని రావించి వీఁడు రత్నో
ద్భవతనయుం డని యతనికిం జూపి తద్వృత్తాంతం బంతయు
నెఱింగించి వానికిఁ బుష్పోద్భవుం డని పేరుఁ బెట్టి యొప్పిం
చిన సుశ్రుతుండును దనమనంబున సవిస్మయవిషాదమోదం
బులు ముప్పిరిగొన నగ్రజునందనుం గొని నిజమందిరంబు
నకుం జనియె మఱునాడు వసుమతీదేవి యొక్కబాలకుని
నెత్తికొనివచ్చి తత్ప్రాప్తిప్రకారంబు దెలియ వల్లభున కి
ట్లనియె.99
ఆ. చనిన రేయి వీనిఁ గొనివచ్చి యొక దివ్య
[1]కాంత నన్ను మేలుకాంచి చేరి
యతివినీత యగుచు నత్తఱి నచ్చెరు
వంద నాకు నిట్టు లనియెఁ బ్రీతి.100
ఉ. ఏ నొకయక్షుకామిని నహీనదయాపరతంత్ర యక్షనా
థానుమతంబునం దగ మదాత్మజుఁ దెచ్చితి నీతనూజుఁ దే
జోనిధి రాజవాహను విశుద్ధయశోనిధిఁ జేర్చి మన్పు మం
భోనిధివేష్టితక్షితివిభుత్వ మతండు వహించు నిమ్మెయిన్.101
వ. నా పేరు తారావళి నీప్రెగ్గడ ధర్మపాలునినందనుండు కామ
పాలుండు మదీయవల్లభుం డని చెప్పి చనియె ననవుడు.102
- ↑ లలన నన్ను మేలుకొలిపి చేరి