పుట:దశకుమారచరిత్రము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

దశకుమారచరిత్రము

     నున్నంత మాళవుం డుగ్రుఁ డై మగధభూ
                    పతిమీఁద వచ్చిన బంధుభావ
     మేర్పడఁ జంపాపురీశుండు సింహవ
                    ర్ముఁడుఁ దాను మగధేశ్వరునకుఁ దోడు
తే. కడిమి నని సేసి సమరరంగమునఁ బడిన
     మాళవేంద్రుఁడు గెల్చియు మహితబుద్ధి
     ననిచిపుచ్చె నయ్యిరువురునందు సింహ
     వర్మ చంపాపురంబునవలని కరిగె.63
క. ఘనుఁ డగు ప్రహారవర్మయుఁ
     దనదేశంబునకు వనపథంబున ననదై
     చనుచో నెఱుకులు దాఁకినఁ
     గనుకని తత్పరిజనము వికావిక లయ్యెన్.64
వ. అమ్మహీవల్లభునకుఁ గవలవారలగు కుమారులు గలరు
     వారలకు నన్నును నాకూతును దాదులంగా నియమించు
     టం జేసి వారికి సమస్తశరీరరక్షలు నేము నడపుచుండుదుము
     గావున.65
క. ఆరాజనందనులఁ గడుఁ
     గూరిమిమై [1]నదిమి యెత్తికొని నడచునెడన్
     వారని కలకల మగుటయు
     బోరన నే మధిపుపజ్జఁ బోవం బోవన్.66
ఆ. అపుడు ధరణివిభుని యంతఃపురాంగనా
     జనముఁ బొదివి యాప్తజనము కొంద

  1. దఱిమి