ద్వితీయాశ్వాసము
37
తాంగుం డగు సుపుత్రుం డుదయించి జాతకర్మాదిసంస్కా
రంబులఁ బ్రదీప్తుం డై రాజవాహనుం డనఁ బరఁగుచుండె
బదెపడి క్రమంబున నలువురుమంత్రులు కాంతిమంతు
లైన కొడుకుల నలువురం బడసిరి సుమతికొడుకునకుఁ
బ్రమతి యను నామంబును సుమ త్రు కొడుకునకు మిత్ర
గుప్తుం డను నామంబును సుమంతుకొడుకునకు మంత్రగు
ప్తుండను నామంబును సుశ్రుతుకొడుకునకు విశ్రుతుం డను
నామంబును గావించిన నక్కుమారుండును నయ్యమాత్య
పుత్రులును ననుదినప్రవర్ధమాను లగుచుండఁ గొండొక
కాలంబునకు.60
క. ఒకనాఁ డొకముని యొకబా
లకుఁ దెచ్చినఁ జూచి వీనిలక్షణములు రా
జకుమారత్వముఁ దెలిపెడు
నకటా! నీ కెట్లు చేరె నని పతి యడిగెన్.61
చ. అడిగిన నానృపాలకున కమ్ముని చెప్పె సమిత్కుశార్థ మే
నడవికి నేఁగి యొక్కయెడ నార్తరవంబు చెలంగుచుండఁ జే
డ్పడి పడియున్న కాంతఁ గని డాయఁగఁబోయి విపన్నిమిత్త మే
ర్పడ నెఱిఁగింపు మీ వనిన భామిని యిట్లని వల్కె వెక్కుచున్.62
సీ. మేటిమగం డగు మిథిలాధిపుడు మగ
ధాధిపు తోడి సఖ్యమున నతని
నాతిసీమంతమునకుఁ బుత్రదారస
మేతంబు తత్పురి కేఁగి యచట