ద్వితీయాశ్వాసము
35
చ. అనిన మహీశుఁ డిట్లనియె నాలములోపల మాళవుండు వై
చినగద చూర్ణితాకృతిగఁ జేసితిఁ దీవ్రశరంబు లేసి య
త్తునియలు వచ్చి సూతు వెసఁ ద్రుంచి మదంగము లెల్ల నొంచినన్
మనమరి మూర్ఛవోయితిఁ గ్రమంబున నియ్యెడ సేదదీఱితిన్.50
క. తేఱినయవసరమున నీ
కాఱడవిం గాంతయెలుఁగు కరుణాస్పదమై
మీఱి చెవి సోఁకుటయు నడ
లాఱఁగ నేఁ బలికితిం బ్రయత్నముతోడన్.51
తే. అరుగుదెంచినతెఱఁ గిట్టి దని యెఱుంగ
ననిన మంత్రులు కాంతలు నాప్తజనులు
నఘటమానవిధాయకుం డగు విధాతఁ
బొగడి రానంద మాత్మ నుప్పొంగుచుండ.52
క. కతిపయదినములకు మహీ
పతి యంగక్షతము లుడిపి భరమైన మనః
క్షత ముడుపఁ దలంచి మంత్రిస
మితి యతనికి నిట్టు లనియె మితవాక్యములన్.53
శా. దేవా! మున్ను సమస్తభూపతులలోఁ దేజోగరిష్టుండవై
యీవింధ్యాచల మధ్యకాననమునం దిబ్భంగి నీయున్కియున్
దైవాధీనము గాక దీనికి విషాదం బందఁగా నేల యం
భోవాహంబులయట్ల సంపద లొగిం బుట్టున్ జెడున్ మాత్రలోన్.54
క. అని బోధించి పదంపడి
జనపతియుం బ్రజయుఁ దారు సకుటుంబముగాఁ