పుట:దశకుమారచరిత్రము.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వాదశాశ్వాసము

327

వ. ఇత్తెఱంగున మాళవేంద్రు నింద్రుచెలిం జేసి తన చెలులు
     తదీయతురంగరథంబులు రయంబునం బొదివి తేరం గైకొని
     ధర్మకాహళ పట్టించి పదాతిపరుషవ్యాపారంబులు సాలించి
     విడిచి.67
ఆ. వార్త ప్రియకుఁ బుచ్చి కీర్తిప్రియుం డయి
     మహిమ యెసక మెసఁగ మాళవేంద్రు
     నాత్మశోక ముడుప నర్హజనంబుల
     మనుజవిభుఁడు నెమ్మిఁ బనిచె నంత.68
క. తా నుత్సుకుఁ డై యుజ్జయి
     నీనగరంబునకు నరిగి నిరతిశయప్రౌ
     ఢానందపూరసంభృత
     మానసనిజవల్లభాసమాగమ మొందెన్.69
వ. ఇ ట్లవంతిసుందరం గలసి తదీయసఖీజనంబు సంభావించి
     యంతఃపురంబున విభుండు పేరోలగం[1]బుండి కుమారవర్గంబు
     నిరర్గళసేవాసుఖం బనుభవించి యాస్థానమంటపంబున నున్న
     సమయంబున సోమదత్తుండును నరపతిపరిజ్ఞాతుం డైన
     పుష్పోద్భవుండునుం దొల్లి హంసకథ వినుటం జేసి యప్రతి
     విధేయంబగు నాపదకు వెఱవక రత్నోద్భవు సంబంధించి
     యప్పురంబునన యునికి నమ్మువ్వురునుం బరమహర్షభరితాం
     తఃకరణు లగుచుఁ గొలువు సొత్తెంచి.70
తే. మున్ను వెదకించి తమ్ముఁ బ్రమోద మెసఁగఁ
     జూడఁ గోరుటకు నెదుళ్లు చూచునృపతి

  1. బిచ్చి