ద్వాదశాశ్వాసము
323
ఆ. సింహవర్ము నిలిపి చెలికిఁ దదీయస
ప్తాంగములును జెల్లునట్లు చేసి
సైన్యములును దాను సఖు లెల్లఁ గొలిచి రా
నడచె మాళవేంద్రు నగరమునకు.45
క. అంత నట దర్పసారుం
డంతయు నిని యాత్మరాజ్య మస్థిర మగుటం
జింతల్లి తపము విడిచి య
వంతిపురికి నేఁగి సైన్యవర్గముఁ గూర్చెన్.46
మ. మానసారుండును మగధనాథనందను తెఱం గెఱింగి
తానును దనయుండునుం గార్యాలోచనంబునకుం జొచ్చిన
సమయంబున నతనితో ని ట్లనియె.47
ఉ. దేవసమానమూర్తి కులదీపకుఁ డేడవచక్రవర్తి యా
భూవరనందనుం డతనిఁ బొందగఁ గన్న యవంతిసుందరీ
దేవియుఁ బెంపునన్ వెలయు దీనిఁ బ్రియంబునఁ గప్ప మిచ్చి సం
భావన గాంచి నీదు నృపభావము సంస్థితిఁ బొందఁజేయవే.48
వ. అనిన విని యతం డుద్ధతుండు గావున నమ్మాట లపహసించి.49
మ. నగుఁబా టారయవైతి వీవు మును కన్యాదూషకుండైన వా
ని గుణాఢ్యుం డని సంస్తుతించె దకటా! నీయట్టివాఁ డి ట్లనం
దగునే? యంతకు నేమి మూడె? నిజసంతానోచితాచారముల్
మగపంతంబును దక్కినన్ జనము లేమం డ్రీభయం బేటికిన్.50
ఉ. వింతయె మాగధుండు మును వీఁడును వానిసుతుండ కాఁడె దు
ర్దాంతమదీయబాహుబలదర్పమునన్ వెలయింపఁ గంటి ని