పుట:దశకుమారచరిత్రము.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

291

     దేశముననుండి యిట యే
     దేశమునకు నరిగె దీవు తెల్లము చెపుమా!28
వ. అనవుడు.29
ఆ. ఆంధ్రదేశనృపతి యగు జయసింహుని
     పురములోననుండి పోవుచున్న
     వాఁడ గౌడభూమి వర్తించువేడుక
     ననిన నిట్టు లంటి నతనితోడ.30
క. ఆదేశంబున నెప్పుడు
     వైదేశికపూజనములు వర్తిల్లునె? ధా
     త్రీదేవుఁడు ధర్మిష్ఠుఁడె?
     యాదేశము తెఱఁగు చెప్పు మంతయు నాకున్.31
వ. అనిన విని యతం డి ట్లనియె.32
ఆ. భూమి లెస్స రాజు పూర్వులతో డిడ
     మేలు వీటిలోన మెలఁగునప్పు
     డేను శుద్ధి గాఁగ నెఱిఁగిన క్రొత్తయుఁ
     గలదు ధరణినాథువలన నొకఁడు.33
చ. అతఁడు కలంబు లెక్కి చని యక్కడ నేమఱియున్న వైరిభూ
     పతి కడు బిట్టు ముట్టికొని భామలతోడన పట్టి తెచ్చిత
     త్సుత దెస సక్తుఁ డై కవయఁ జూచిన రేఁగి తదీయగాత్ర సం
     శ్రితుఁ డగు బ్రహరాక్షసుఁడు చేరఁగనీడు మహెగ్రచేష్టలన్.34
ఉ. దాని నెఱింగి మంత్రములు తంత్రములున్ జపముల్ తపంబులున్
     దా నొనరింపఁబంచె వివిధక్రమశాంతికపూర్వకంబుగా
     దానము లెల్లఁ జేసి విదితంబుగఁ గల్పము లెన్ని యన్నియుం