పుట:దశకుమారచరిత్రము.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

289

     నీకతమున మా కిప్పుడు
     చేకుఱె నని గౌరవించి చిత్తం బలరన్.18
వ. అతనిం బుచ్చి యనంతరంబ.19
శా.ఆలీలావతి గ్రక్కునం జెలుల డాయం బోయి మేల్కొల్పి మం
     దాలాపంబుల నంతయుం దెలిపి కన్యాగారగూఢస్థలిం
     గేలీమజ్జనభోజనాదివిధు లక్లేశంబునం జెల్లున
     ట్లాలోకించి తగంగ న న్నునిచె ని ట్లత్యంతమోదంబునన్.20
వ. విచ్చలవిడి విహరించుచున్నం గొన్నిదినంబులకు వసంతా
     గమం బగుటయు వనక్రీడాలాలసుం డై కర్దనుం డంతః
     పురకాంతాసమూహంబును దుహితయుం దత్సఖీజనంబులు
     వినోదసముచితపరివారంబును దానునుం బయోధివేలావన
     భూమికిం జని తత్ప్రదేశంబున బహుదివసంబులు కేలి
     సలుపుచున్న సమయంబున.21
సీ. ఆంధ్రదేశాధీశుఁ డగు జయసింహుండు
                    ప్రతిభటుం డగుట రంధ్రంబు వేచి
     బరిమితపరిచారపరిగతుఁ డని తన
                    వేగులు చెప్పిన వివిధయాన
     పాత్రముల్ సమకట్టి బలములుఁ దానును
                    వారాశిలోఁ జొచ్చి తీరభూమి
     డిగ్గి మోహరములు డిగ్గనఁ దీర్చి కం
                    పితమహీతలుఁ డయి బిట్టు మండి
తే. లీల నేమఱియున్న కళింగవిభునిఁ
     గామినీజనసహితంబు గాఁగ [1]నడఁగఁ

  1. నడల