దశమాశ్వాసము
259
ల్లను గందర్పుని చేత నోఁబడితి నుల్లం బెంతయున్ బెగ్గిలన్.44
వ. అంత సూర్యోదయం బగుటయుం జంద్రసేన నన్నుం బొ
మ్మని నియమించినం గందుకావతివలని లోలత్వంబున బేల
నై యియ్యకొని పోవఁ దానునుం జనియె నేను దినము
ఖోచితవ్యాపారంబుల నాదరంబున నిర్వర్తించి.45
శా. మాద్యచ్చిత్తుఁడ నై మహీశసుత నాత్మంగోరి తాపంబుతో
నుద్యానంబున మాధవీగృహములో నున్నంత నచ్చోటికిన్
హృద్యాకారత మేదినీశతనయుం డేతెంచి పట్టించి న
న్నుద్యత్కోపముతోడఁ జూచి పలికెన్ హుంకారపూర్వంబుగన్.46
ఆ. నీవు రాజవేని నీ బంటునకుఁ జంద్ర
సేన తాను వనిత యౌనె? కందు
కావతీవధూటి దేవి యటే! నీకు
బావ రాజ! యెచట బ్రదికె దింక.47
వ. అని పలికి యన్యు లెఱుంగకుండఁ దనయింటికిం గొనిపోయి
శృంఖలానియమితచరణుం జేసిన.48
తే. నాదుమోసంబు దైన్య మొనర్చెఁ గాన
దూఱు నగవక దైవంబు దూఱు టుడిగి
బోటి [1]నేరమి నింతలు పుట్టె నని త
లంచుటయు మాని నన్న నిందించుకొనుచు.49
వ. ఇ ట్లని విచారించితిఁ జంద్రసేన లోఁతుగల మనంబు లేని
యది యగుటం జేసి. వెఱంగుపడి తలంపు తుంగధన్వున
కెఱింగించు క్రమంబునకుం జొరక భీమధన్వుకడకుం జని
- ↑ యెడ నిమిత్తంబులు