258
దశకుమారచరిత్రము
ద్భూమి(శసుతున కీపైఁ)
బ్రేమంబును బోవు నీకుఁ బ్రియ మొనరంగన్.38
క. అనిన దరహసితముఖి యై
నను నీజన్మంబునందు నగచరవంశం
బునఁ బుట్టించెదు చుట్టమ
వని నమ్మిన నిట్లు చేయ నగునే! నీకున్.39
వ. అని మఱియు ని ట్లనియె మనకుం గుటిలోపాయంబు పని
లేదు మనతలంపు సఫలం బయ్యె నది యె ట్లనిన.40
తే. కందుకావతి యెవ్వనిఁ గలిసె వాఁడ
మగఁడు భీమధన్వుండు నమ్మగువమగని
జేరి బ్రదుకంగఁ గలఁ డని చెప్పె నొక్క
దైవ మాదివ్యవాక్యంబు దప్ప దెట్లు.41
ఉ. ఆయబలాలలామ భవదాస్యము వేడుకతోడఁ జూచి పు
ష్పాయుధుచేత నోఁబడియె నంతయు రాజున కేన చెప్పి నిన్
రోయఁగ వత్తుఁ గందువ యెఱుంగుట నాతఁడు నన్న పంచినన్
వేయును నేల నీవు పృథివీపతి యయ్యెదు దైవశక్తితోన్.42
వ. భీమధన్వుండు నీచేతిలోనివాఁడ యదియ మాకుం బ్రదు
కుతెరు వీరాత్రి యించుకసే పెట్లైన నూరకుండి యెల్లి
మనకార్యము సఫలంబు చేసికొందము.43
మ. అని న న్నూఱడఁ బల్కి వల్లె యనఁగా నాలింగనం బర్థిఁ జే
సి నరేంద్రాత్మజఁ గొల్వ నేఁగుటయు నేఁ జింతానిమగ్నుండ నై
కనుదో యించుక యేని నిద్రఁ బొరయంగా నేరమిన్ రాత్రి యె