పుట:దశకుమారచరిత్రము.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

దశకుమారచరిత్రము

ఉ. ఆనగరంబు చేరి నిటలాంబకు గేహము డాయఁ బోవుచో
     మానవనాథపుత్రి నవమాలిక సౌధముమీద గాఢని
     ద్రానిరతాత్మ యై యునికి తక్కక చూచి తదీయశయ్యపై
     మానుగ నిన్నుఁ బెట్టి పురమర్దనుఁ గొల్వఁగఁ బ్రీతిఁ బోయితిన్.20
చ. ఉరగవిభూషణుం గొలిచి యుత్సవలీలలు చూచి భక్తిమై
     గిరిజకు మ్రొక్కి తత్కరుణఁ గిల్బిష మంతయుఁ బాచి తొంటివ
     త్సరపరిభోగ్యమైన పటుశాపము చెచ్చెర నీఁగ వచ్చి సుం
     దరికడ నాస సేయు నినుఁ దప్పక చూచితి విస్మయంబుతోన్.21
వ. ఇట్లు కనుంగొని శాపదురితసమాగతపురాతనమహానుభావ
     నగుటం జేసి ని న్నెఱింగి.22
ఆ. అకట! యితఁడు ప్రమతి యగు వింధ్యభూమికి
     నేల వచ్చె నొక్కొ యీలతాంగి
     మీఁద నిపుడు దగులు మిగిలె ని ట్లీతం డ
     నంగు చెయ్ది దనతెఱంగు మఱచె.23
వ. అనిన నీవచ్చినవిధంబునుం గని యుమ్మలించి నిను నుపలక్షించి.24
ఉ. డెందమునందుఁ గూటమి కడిందిగఁ జూచుటఁ జేసి ముద్దియం
     బొందఁగ లేఁడు వీఁడు పొరపొచ్చెపు నిద్రయ పోవుచున్నవాఁ
     డిందుల నాకు నిల్పఁ దగ దిప్పుడ నెయ్యముఁ దియ్య మెక్కఁగాఁ
     బొందొనరింపఁ బ్రేమ మదిఁ బొందియుఁ జూడదు వీని నేనియున్.25
వ. కావున వీనికిం జొక్కు పుట్టించి యిమ్ముద్దియకుం బ్రమో
     దం బాపాదించి రాత్రిసమయంబున నిజతల్పంబుపై వింత
     మానిసిం గని పుట్టుదిగులుం బరిహరించి దీని సౌందర్యంబు