పుట:దశకుమారచరిత్రము.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

237

క. వెఱఁగుపడి చిత్రరూపము
     తెఱఁగున నున్నంత నరుణదీప్తులు పర్వం
     బఱతెంచెఁ దరణిరథ మ
     త్తఱి నొండువిచార ముడిగి తత్పరమతి నై.13
క. అంతయుఁ దెలియ నెఱుంగక
     కాంతారము వెడలిపోవఁ గాంచితిఁ గల యం
     చెంతయుఁ దెంపున వృక్షో
     పాంతంబున దైవసాక్షిఁ బ్రతినలు పట్టన్.14
వ. తదవసరంబున.15
తే. కరుణ పొడవైనయ ట్లొక్క సరసిజాక్షి
     వచ్చి నాయెడ మాతృభావంబు దోప
     నిలుచుటయు భక్తిఁ బ్రణమిల్లి నిన్ను నాకు
     నెఱుఁగ నానతి యిమ్మన్న నిట్టు లనియె.16
మ. తనయా! నీ చెలి యర్థపాలుజననిం దారావళిం దొల్లి యే
     ననిమిత్తంబ పతిం దొరంగి కడు నన్యాయంబునం బోయినం
     గని య క్షేశ్వరుఁ డల్గి వర్షపరిభోగ్యంబైన శాపంబు గ్ర
     క్కున నా కిచ్చిన భూత మైతిఁ దుది నీక్షోణీజముం జేరితిన్.17
వ. ఇది నా తెఱుంగు విను మని యి ట్లనియె.18
శా. శ్యావస్తీనగరంబునందు మహితం బై చెల్లు నప్పార్వతీ
     దేవీవల్లభు నుత్సవంబునకు నర్థిం జూడఁ బో నున్నచో
     నీ వీవృక్షముక్రేవ నాశ్రితుఁడ వై నిద్రించుడున్ డించియున్
     బోవం జాలక నిన్ను నెత్తుకొని యంభోవాహవీథీగతిన్.19