పుట:దశకుమారచరిత్రము.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

223

     దుర్వినయంబు సైఁచి దయతో ననుఁ జేకొను నీవు నావుడుం
     బూర్వకృతంబుమందలకు భూపతి వెల్వెలఁబాఱి యి ట్లనున్.45
ఉ. ఎగ్గులు చూపి చంపు మని యెక్కులు పెట్టిన వారిపల్కు లే
     లగ్గుగ నాత్మలోపలఁ దలంచి వివేకము లేక యిట్టి నీ
     కగ్గలమైన దండ మనయంబునఁ జేసితి మోసపోయి నే
     సుగ్గడి నైతి నీ మొగము చూడఁగ నెట్టులు నేర్తు జెప్పుమా.46
ఉ. అల్లుఁడ వీవు రాజ్యమున కంతకు నర్హుఁడ వీవు భూమికిం
     దల్లివి తండ్రివిన్ బహువిధంబుల దాతవు నీవు మాకులం
     బెల్ల సముద్ధరింప నుదయించిన పుణ్యుఁడ వీవు నీకు నే
     నెల్లి మదీయపుత్రిఁ బుర మెల్ల నెఱుంగఁగఁ బెండ్లి సేసెదన్.47
వ. అని యిత్తెఱంగున నూఱడం బలికి మఱియు ననేకప్రకా
     రంబుల బహుమానంబులు శపథసహితంబులు నగు మాట
     లాడి కలసికొనినం బరస్పరవిస్రంభప్రసన్నహృదయుల మై
     యున్నంత వేగుటయు నమ్మహీపతి మంత్రిపురోహితవర్గం
     బున కంతయుం దెలిపి తారావళి మహానుభావంబుల నొండు
     దలంప నేరక తదనుమతిం గాంతిమతి నాకు నిచ్చి సేనా
     ధిపత్యంబు నియోగించెఁ దారావళియునుం గుబేరుచేత
     విన్న వృత్తాంతంబుం దనయు నిల్లడ యిడి తా నిట వచ్చు
     టయఁ గాంతిమతికి సవిస్తరంబుగా నెఱింగించిన నవ్విధం
     బున నలవడి సుఖంబున నున్నవాఁడ నని యాత్మవర్తనవ్ర
     కారం బంతయు నేర్పడం జెప్ప నిట్లు మైత్రి నిష్టభృత్యుండ
     నై యుండుదు నతండును నిజస్వామికిం గార్యఖడ్గంబులకు
     ననన్యసామాన్యం బైన సాహాయ్యం బనుష్ఠింపుచు మహో
     న్నతుం డై ప్రవర్తిల్లుచుండం గొండొకకాలంబునకు.48