పుట:దశకుమారచరిత్రము.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

దశకుమారచరిత్రము

క. మును దాది చేత నావ
     ర్తన మంతయుఁ దేటపడఁగఁ దండ్రి కిఁ బ్రమదం
     బునఁ జెప్పి పుచ్చి యభిషి
     క్తునిఁ జేసితి నతులభక్తితో నానృపతిన్.157
వ. ఏనును జనకానుమతంబున యువరాజపట్టంబు గట్టి చన
     వీయ విరహాతురత్వవిరసంబు లేక రాజ్యసుఖంబు లనుభ
     వించుచుండి.158
తే. కూర్మిచెలియైన యాసింహవర్మపొంటె
     మర్మభావితుఁ డగు చండవర్మమీఁద
     వచ్చి కాంచితి మిచట దేవరపదార
     విందయుగ్మంబు నిర్భరానంద మొంద.159
చ. అనిన నృపాలకుండు సఖు లందఱి మోములఁ జూచి నవ్వి యి
     ట్లనియెఁ బరాంగనాగమన మయ్యును సత్క్రియ గాదె వీనిచే
     సినయది తల్లిదండ్రులకుఁ జిత్తవిషాదవిమోచనార్థమై
     యునికి ననూనరాజ్యసుఖయోగమునన్ జనుఁ గీర్తనీయమై.160
క. అని యిట్లు తానుఁ జెలులును
     జనపతి యుపహారవర్మచరితము ప్రీతిం
     గొనియాడి యర్థపాలుం
     గనుఁగొని దరహసితవదనకమలుం డగుచున్.161
క. నీ వేదేశమునకుఁ జని
     యేవెరవున నేమి చేసి తేవేషముతో
     నేవిధమున నెటు నిలిచితి
     నావుడు నాతండు భక్తినమ్రుం డగుచున్.162
వ. ఇ ట్లనియె.163