210
దశకుమారచరిత్రము
వినుతికి నెక్కిన మణి గల
దని విని కొనువార మైతి మన్యాయమునన్.147
క.. ధననంతుఁడైన శతహలి
యను నెలమనిమీఁద లేని యన్యాయపథం
బొనరించి పట్టుకొని యా
తని యర్థం బెల్లఁ గొనఁగఁ దలఁచితి మబలా!148
క. ఉఱిది విషము వెరపున నిడి
చెఱ నున్న ప్రహారవర్మఁ జెచ్చెరఁ జంపం
దెఱఁగు విచారించితి మతఁ
డఱగమిఁ జచ్చె ననువార మై లలితాంగీ!149
వ. అని యిట్లు పలికి మృగతృష్ణికాపానలాలసంబైన హరిణం
బునుం బోలె సుందరాకారసంప్రాప్తిలంపటుం డై యున్న
నేనును నింక నెడ సేయం దగ దని సమయింపం దలంచి.150
ఉ. పారముఁ బొందె నీక్రియ తపస్విని చెప్పిన భంగి నగ్నిభ
ట్టారకుఁబూజ సేయుము దృఢంబుగ నన్నుఁ గవుంగిలింపు మిం
పారెడు రూపముం బడయు మన్నఁ బ్రదక్షిణపూర్వకంబుగా
ధారుణిఁ జాఁగి మ్రొక్కుటయుఁ దత్సమయంబున వాని జంపితిన్.151
ఉ. పీనుఁగు నగ్నిఁ ద్రోచి మది బెగ్గల మంది వడంకుచున్న య
మ్మానిని యుత్తలంబుడిపి మందిర ముత్సవలీలఁ జొచ్చి కాం
తానివహంబులో సముచితంబుగఁ గొండొకప్రొద్దు నిల్చి య
బ్జాననచెట్ట పట్టుకొని యల్లన పోయితి సెజ్జయింటికిన్.152
క. ఆరాత్రి సుదతితోడి వి
హారంబులఁ బ్రొద్దు పుచ్చి యందలి యుచితా