సప్తమాశ్వాసము
207
వ. ఇ ట్లనేకప్రకారంబుల జను లెల్లం గుజగుజవోవుచుండం
బర్వదినం బగుటయు మనతలంచినవని యారాత్రిం దీర్చు
వార మని పుష్కరికచేతఁ గల్పసుందరి నా కెఱింగించి
పుత్తెంచిన నేనును సన్నద్ధుండ నై యున్నంతం బ్రదోష
వేళ మాధవీమండపప్రదేశంబున శ్రీకంఠకంఠధూమ్రంబైన
ధూమం బెగసెం బదంపడి దధి రుధిర సర్పి తిల మాష
క్షీర కర్పూ రాద్యాహుతపరిమళితమారుతంబు సుడిసినం
దత్క్రియానిర్వర్తనప్రకారంబగు టెఱింగి ధూమశమనా
నంతరంబ యతినిగూఢంబుగాఁ బ్రమదవనంబు సొచ్చి లతా
గృహంబున నోలంబు గొనియాడి చరించు సమయంబున
నమ్ముదిత సమ్మదంబునం జనుదెంచి నన్నుఁ గౌఁగిలించుకొని
యి ట్లనియె.131
మ. మును రాగానలసన్నిధిన్ హృదయజన్ముం డర్థిమై వచ్చి ని
చ్చిన నంతం దనివోక నీకు నను నాచిత్తంబు నేఁ డిప్పు డీ
యనలంబుంద గ సాక్షిగాఁ బడసి యాహ్లాదంబుతో నిచ్చెఁ గై
కొని రక్షింపుము జీవితేశ! యిట పల్కుల్ వేయు నింకేటికిన్.132
తే. అని మృగేక్షణ మఱియు ని ట్లనియె నేను
వికటవర్మనృపాలకు వెడ్డువెట్టి
ఘటనయైన యమ్మాట నీకఱపినట్ల
యర్థి నిప్పు డేకతమున నాడుటయును.133
క. విని యానరపతి వినయా
వనతుం డై గారవించి వనజానన నీ