సప్తమాశ్వాసము
203
యంగసంభవుని కట్టనుఁగైన యమృతాంశు
నాననాంబుజకాంతి నూనపఱచి
కందర్పుసేనముంగలియైన నునుఁగమ్మ
దను గాలి నూర్పుగాడ్పున జయించి
తే. యున్న నిన్నుఁ జిత్తోద్భవుఁ డిన్నివిధులఁ
బఱచు టరయంగ నుచితంబె పంకజాక్షి!
యెన్నరాని బన్నంబుల నన్నుఁ బఱచె
నేను వానికిఁ జేసిన యెగ్గు గలదె?111
క. పొందుగఁ గాయజువిషమునఁ
గందిన నాయంగములకుఁ గామిని! యమృత
స్యందియగు నీకటాక్షము
మం దొనరింపుము దయార్ద్రమతి నింపెసఁగన్.112
మ. అని యజ్జోటికి విస్మయంబును బ్రమోదావేశముం జేసి య
ల్లన పొం దొంది కవుంగిలించి సరసాలాపంబు పుట్టించి యా
ననపద్మము ముఖంబునం గమిచి మేనం జొప్పు గాకుండ మె
త్తన కామాంకము లావహించి రతితంత్రవ్యాప్తి మోదించితిన్.113
క. సురతాంతోచితకృత్యము
లరుదుగ నొనరించి యున్న యవసరమున నేఁ
బరిరంభణమ్ము సేసిన
నరుగుతలం పెఱిఁగి పంకజానన పలికెన్.114
క. నీవుం బ్రాణము నాకును
భావింపఁగ నొక్కరూపపరమార్థము నీ
పోవుట విను ప్రాణము తెగఁ
బోవుట సంశయము లేదు భూపకుమారా!115