సప్తమాశ్వాసము
189
గావలయు పనులు నరయఁగ
దైవాయత్తములు వగపు దక్కుము కొడుకా!34
క. అని నాకు న్మజ్జనభో
జనములు నాదరణమును బ్రసన్నత గావిం
చినఁ దుష్టి బొంది యమ్మఠ
మున నొక్కెడ విశ్రమింప మునుమా పగుడున్.35
తే. అచ్చటికి నోర్తు వచ్చిన నవ్వ నన్ను
నెలమిమైఁ జూపి దానికి నిట్టు లనియె
దైవగతిఁ జేరెఁ జూచితే తరుణి! నాఁడు
బోయచేఁ బడి పోయిన భూపసుతుఁడు.36
వ. అని యది కూఁతు రగుట నా కెఱింగించి యేను దనచేతి
కుమారుం డనియును దానియెత్తికొనివచ్చినవాఁడును బ్రతి
కియునికియు నవి మొదలుగాఁ దాను నాచేత విన్నవృత్తాం
తంబు లన్నియు దాదికిం జెప్పి యతనిబుద్ధిపరాక్రమంబుల
వలనను దైవయోగంబునను మన కెల్లకార్యంబులు సిద్ధించు
ననిన నదియును సంభ్రమసంతోషంబు లడర నన్నుం గౌఁగి
లించుకొని మ్రొక్కి వినయంబుతో సల్లాపంబు సేయుచున్న
సమయంబున దానికి నంతఃపురంబున మచ్చికతోడినడవడి
గలుగుటయు నెఱింగికొని.37
చ. పగతునిఁ జంప నెన్నియు నుపాయము లారయుచున్న నాకు ని
మ్మగువ నిజంబుగా నృపతిమందిరవృత్తము చెప్పెనేని నేఁ
దగు లిడి నిశ్చయించి యుచితస్థితిఁ జేయుదు లోకసమ్మతం
బగుగతిఁ గార్యజాత మని యాత్మఁ దలంచి కరంబు నెమ్మితోన్.38