పుట:దశకుమారచరిత్రము.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

185

క. జనపతి శిథిలితగతిఁ గా
     ననదుర్గమ మైన తెరువునం దాఁకిరి చు
     ట్టును ముట్టి దాపశిఖిచా
     డ్పునఁ దివురు శరార్చు లడర బోయలు పెలుచన్.12
ఆ. అపుడు ధరణివిభుని యంతఃపురాంగనా
     జనముఁ బొదివి యాప్తజనులు కొంద
     ఱొక్కదిక్కుఁ దొలఁగ నొకభంగిఁ గొనిపోయి
     రేటు దాఁకి నొచ్చి యేను బడితి.13
క. ఆతఱి నుధ్ధతుఁ డొక్కకి
     రాతుఁడు చనుదెంచి యధికరభసమున న్నా
     చేతికుమారునిఁ జేకొని
     యాతతగతి నంత నతనికై చనియె వడిన్.14
వ. ఏనును పోటుగంటి నెత్తురు వడసి తెప్పిఱి మర్మంబు గాడ
     కునికిం జేసి ప్రాణంబు విడువక యీయవస్థ గుడుచుటకుం
     గా బ్రతికి పతి యరిగినదెస నల్లనల్లన చని యొక్క పల్లె
     లోనం బథశ్రాంత యై యున్నకూఁతుం గని దానివలన
     రెండవకుమారుండును బోయలపాలువడి పోవుట విని నా
     తెఱంగునుం దానికిం జెప్పి యడవి నే మిరువురము నొం
     డొరువులం గౌఁగిలించుకొని యేడ్చుచున్నంత.15
క. అం దొకధర్మపరుం డా
     క్రందనములు దీర్చి మమ్ము గారవ మెసఁగన్
     మందిరమునకుం గొని చని
     [1]మం దిడి నాపోటుగంటి మాన్చెఁ గ్రమమునన్.16

  1. మందుల