పుట:దశకుమారచరిత్రము.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

దశకుమారచరిత్రము

     ధనమిత్రునకు సమాగమంబు సేసితివి గావున వానియజిన
     రత్నంబును ని న్నేలినదాని యాభరణంబులు నపహరించితిఁ
     బెక్కుచోట్లు మ్రుచ్చిలి తెచ్చిన ధనంబులు ప్రాణభయం
     బునం జూపితినేనియు రెండుదెఱుంగులు నొప్పింపం జలంబు
     సాధ్యం బయ్యె నింక నెట్టైనను వగపు లేదు నీయడియాస
     లుడిగి పొమ్మనిన నదియును నప్పటిచావు దప్పింపఁ దలవరు
     లకు ధనంబునాస సూపుటకు నాఘటించినకపటసూత్రంబు
     గనుంగొని దైన్యంబు భావించి.113
సీ. ధనమిత్రు నజినరత్నంబు గ్రమ్మఱ వాని
                    కిచ్చిన నోకటి మే లీనినాఁడు
     రెండు మే లది యటు లుండని [1]మ్మేను ని
                    న్నర్ధితో వేఁడెద నాదరింపు
     చిరకాలపరిచర్య చేసిన రాగమం
                    జరికి నీ వొకతప్పు సైఁపవలయు
     దొడవులు వెలియైనఁ బడపు పుట్టదు వెల
                    యాలికి నింతయు నాత్మ నెఱిఁగి
తే. యీరసము దలపోయక యీవు తొల్లి
     మెలఁత ప్రీతితోఁ జేసిన మేలు దలఁచి
     యకట! యిచ్చోట నడఁచితి ననుచు దాని
     నిక్క మెఱిఁగింపు మని చాఁగి మ్రొక్కుటయును.114
వ. ఏను గరుణ భావించికొని తొడవులున్న కందువ సెప్పెద
     ర మ్మని సృగాలికం జేరం బిలిచి నా బ్రతుకుఁదెరువునకుం
     దగినమాటలు గఱపి యి ట్లంటి నిమ్మాటలు ధనమిత్రునకుం

  1. మ్మొకటి