పుట:దశకుమారచరిత్రము.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

155

క. అతనికిఁ బ్రాణముకంటెను
     హితుఁడు విమర్దకుఁడు పౌరు లెల్లను వినఁగా
     నతిమానుషములు పలికెను
     గతభయుఁ డై క్రొవ్వి గన్నుఁ గానక నన్నున్.67
వ. అని పలికి సభ్యులు దన్ను వారించుచుండ నంతం దని
     వోవక.68
ఆ. తోలుతిత్తి వడసి తోరంపుఁగాఁప వై
     నీవు చిఱుమ నేల నేటిరాత్రి
     కంటఁబిడుకఁ బ్రామి గర్వంబు గిర్వంబు
     నుడుప నైతినేని నొట్టువెట్టు.69
వ. అని యిడుపులు సాటుచుం జనియె.70
క. కావున నాతఁడు మ్రు చ్చగు
     నావిజ్ఞాపనము బొం కనం జన దిటమీఁ
     దే వెఱతు విన్నవింపఁగ
     నావుడుఁ గరుణించి ధరణినాథుం డనియెన్.71
చ. అడలఁగ నేల యీక్షణమ యర్థపతిం బిలిపించి తెల్లఁగా
     నడిగెదఁ జొప్పు దప్ప నతఁ డాడిన నప్పుడ పట్టి కట్టి పెన్
     మడువునఁ ద్రొక్కఁ బంచెద విమర్దకు నాలుక వ్రయ్యఁ గోసి త్రు
     ళ్ళడచెదఁ జర్మరత్నము రయంబునఁ దెచ్చెద నీకు నిచ్చెదన్.72
మ. అని యర్థాధిపతుల్యు నర్థపతి నన్యాయాత్మునింగా మనం
     బున గాఢంబుగ నిశ్చయించి యలుకన్ భూపాలకుం డప్పు డా
     తని నచ్చోటికిఁ బిల్వఁ బంచి మృదులోదారోక్తి శోభిల్ల ని