154
దశకుమారచరిత్రము
కొని మత్ప్రియాగృహంబున కేఁగి యచ్చోట
మున్న సంకేతించి యున్నయెడకుఁ
జొచ్చి మాధవసేన నిచ్చమై నల్లన
తెలిపి దానికి దోలుతిత్తి యిచ్చి
కామమంజరికి నొక్కతెకు నెఱింగించి
రాగమంజరి ననురాగ మెసఁగ
తే. నపుడ వరియించి వారల యనుమతమున
నేను నదియును మాయింటి కేగుదెంచి
మదనుఁ జరితార్థుఁ గావించి మగుడ మగువ
ననిచిపుచ్చితి వేకువ యయ్యె నంత.63
క. మును నిగిడెడు నరుణాంశులు
వనజంబుల కెంపు గలసి వన్నియ మిగులం
దనుఁ గని లోకం బలరఁగ
నినుఁ డుదయాచలముశిఖర మెక్కెం బ్రీతిన్.64
వ. ఇట్లు సూర్యోదయం బగుటయుం దత్కాలోచితకరణీ
యంబు లాచరించి యిల్లు మ్రుచ్చులు చొచ్చుట పొరు
విండ్లవారు విన నాఘోషించి రాజు నవసరం బెఱింగి
యేను గఱపి వుచ్చ నుదారకుండు నగరికిం జని తన
యజినరత్నంబు కన్నంబునం బోయె నని ఖిన్నవదనుం డై
విన్నవించి వెండియు ని ట్లనియె.65
క. కారణము లేక నాతో
వైరము గొని యర్థపతి వివేకవిహీనుం
డై రేయుఁబగలు నుడుగక
పోరాడుచు నుండు నర్థమున గర్వమునన్.66
'