4
దశకుమారచరిత్రము
ఉ. శ్రీవిభుఁడైన యామనుమసిద్ధికిఁ బుణ్యచరిత్రయైన శ్రీ
దేవికిఁ బుట్టెఁ దిక్కజగతీతలనాథుఁ డశేషలోకసం
భావితుఁడై ధరాభరము వాపఁగ నావసుదేవదేవకీ
దేవుల కుద్భవించి వినుతిం జెలువొందిన కృష్ణుఁడో యనన్.14
వ. ఇ ట్లుదయించి రాజ్యాభిషిక్తుం డైన యనంతరంబ.15
సీ. బలిమిచేఁ (బృథ్వీశుతలఁ ద్రుంచె) [1]సేవణ
కటకసామంతుల గర్వ మణఁచె
ద్రవిళమండలికు లందఱఁ దక్క నేలెఁ జో
డని నిజరాజ్యపీఠమున నిలిపెఁ
గర్ణాటవిభునహంకారంబు మాన్పించెఁ
బాండ్యునిచేతఁ గప్పంబు గొనియె
నేఱువమన్నీల [2]నెఱి పుట్టఁగా నేలె
వైరివీరుల నామలూర నోర్చె
తే. [3]త్రిభువనీరాయపెండారుఁ డుభయకటక
వీరుఁ డభినవభోజుఁ డాకారమదనుఁ
డవనిభారధౌరేయమహత్త్వవిజిత
దిక్కరీంద్రుండు చోడలతిక్కనృపతి.16
క. మరునకు ననిరుద్ధుఁడు శ్రీ
వరునకు మకరధ్వజుండు వసుదేవునకున్
హరి పుట్టినక్రియ నతనికి
జిరతరకీర్తితుఁడు మనుమసిద్ధి జనించెన్.17
వ. అతనిగుణవిశేషంబు లెట్టి వనిన.18