102
దశకుమారచరిత్రము
తరమున బిసగుణనిగళిత
చరణము నొకహంసఁ గనిరి జంపతులు కలన్.66
వ. అంత నిద్రావసానం బగుటయు.67
ఉ. రాజతశృంఖలం బెనఁగి రాజపదద్వితయంబు తారకా
రాజకరావృతం అయిన రక్తసరోజయుగంబువోలె ని
స్తేజము నొందియఃన్నఁ గని చేడ్పడి తా నెలుఁ గెత్తి యేడ్చెఁ గాం
తాజనరాజి బెగ్గడిలఁ దామరసాక్షి విపాదవేదనన్.68
క. పరు లెఱిఁగిన నాఱడికిం
గరి యగు నను తలఁపు లేక గతధృతి సననీ
శ్వరసుత విరివేనలితోఁ
బురపురఁ బడి యేడ్చుచుండె భూభాగమునన్.69
క. అంతిపురము జను లెఱిఁగి య
నంతభయభ్రాంతిఁ బొంది యప్పుడె తద్వృ
త్తాంతంబు చండవర్మున
కంతయు నెఱిఁగించి రాగ్రహంబున నతఁడున్.70
క. విని కినిసి యుదిరిపడి చ
య్యన నంతఃపురముఁ జొచ్చి యతికోపనుఁ డై
కనుఁగవ నిప్పులు రాలఁగ
వనితాపరివృతుని రాజవాహనుఁ బలికెన్.71
క. నాతమ్మునిఁ జంపిన[1]యఱ
జాతికి వీఱిఁడికి బాలచంద్రికకు మగం
డై తిరిగెడు పుష్పోద్భవుఁ
డీతనికిం బ్రాణబంధుఁ డెల్ల నెఱుఁగుదున్.72
- ↑ దుర్జాతికి