పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

148

తెలుగు భాషా చరిత్ర

(పై. 6.1101.12,1420 ) విశాఖ మొ.వి. ఇది ఆప్రాంతపు ప్రాకృతభాషా ప్రభావం వల్ల అని చెప్పాలి. త్రికంలో ఉన్న 'ఈ' శాసనాల్లో తరచుగా. 'ఇ' హ్రస్వరూపంలో కనిపిస్తుంది. ఇ నిజోగి ( పై. 6.1076.7, 1416), ఇ కొలువు (పై. 6,777.11,1461) మొ. వి.

5.9. క్‌ > గ్‌ : సుకృతం అనేమాట ఈ యుగంలో చాలా తరచుగా గకారంతో వ్రాయబడి ఉంది. సుగృతంగాను (SII 5. 94.5,1432), (పై. 5.104. 12 1423), సుగృతమగాను (పై. 4 694.7,1425) మొ. వి. అఖండము అనడానికి అగండం అని శాసనాల్లో క్వాచిత్కంగా కనిపిస్తుంది. అగండదీపానను( పై.6.667. 10, 1422) మొ.వి.

5.10. ఙ్ఞ > గ్న : 'ఙ్ఞ' ను పూర్వకాలంలో 'గ్'నగా ఉచ్చారించే వారని డా. చిలుకూరి నారాయణరావుగారు అన్నారు, శాసనాల్లో “జ్ఞ " కు బదులు " గ్న " వ్రాయబడలేదు, కాని “గ్న” కు బదులు “జ్జ " వ్రాయబడింది.ఆఙ్ఞేయభాగం (SII 10. .748.24,1583)మొ.వి. ఇటువంటి రచన విలోమలేఖనాపద్ధతి (Inverse Spelling) అని తీసుకొంటే 'జ్ఞ 'ను 'గ్న'గా ఉచ్చరించే వారని చెప్పవచ్చు.

5.11. చ వర్ణానికి [చ చే] అని రెండురకాలైన ఉచ్చారణ ఉన్నట్లు ముందే చూశాం. ద్విత్వంలో చ్చ కు బదులు త్స వ్రాయడం కూడా దీనికి ప్రబలతార్కాణం అవుతుంది. పత్సలు (పచ్చలు) (తొ. తి. దే. శా. 3.32,1512) మొ.వి.ఉత్సవ అనడానికి ఉచ్చవ అని విలోమలేఖనపద్ధతిలో వ్రాసి ఉండడం కూడాదీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఉచ్చవదేవళన్ను ( SII 4. 1344.7,1470 ). మొ.వి.

5.12. ఈయుగంలో శకటరేఫ వ్రాతలో ఉండినా, శకటరేఫకు సాధురేఫకు మధ్యభేదం పోయినట్లే చెప్పవచ్చు. శకటరేఫకు బదులు సాధురేఫ వాడటం ఈయుగంలో గతయుగం కన్నా చాలా తరుచుగా సంభవిస్తుంది. కరియముదు ( SII 5.5.7,1404), విరుగమొత్తి (పై. 5.26.4, 1412), మనుమరాలు (పై.5.1248.15,1471), తాటిపరు (పై. 4.800.5,1513) మొ. వి. ఒక్క చెఱు వు శబ్దమే తీసుకొన్నా కూడా చెర్వుకింద ( పై. 686.44, 1580,4.702.104,1518), చెరువుగట్టించి (పై. 4.702.108,15180), చెరువులు ( పై. 4.709.43,1558)