ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 0288-02 సాళంగనాట సం: 03-507 నృసింహ
పల్లవి:
ఆదిమపురుషుడు అహోబలమునను
వేదాద్రిగుహలో వెలసీ వాఁడే
చ. 1:
వుదయించె నదిగో వుక్కుఁ గంభమున
చెదరక శ్రీనరసింహుడు
కదిసి హిరణ్యుని ఖండించి ప్రహ్లాదు-
నెదుట గద్దెపై నిరవై నిలిచె
చ. 2:
పొడచూపె నదిగో భువి దేవతలకు
చిడుముడి శ్రీనరసింహుఁడు
అడర నందరికి నభయం బొసగుచు
నిడుకొనెఁ దొడపై నిందిరను
చ. 3:
సేవలు గొనె నదె చెలఁగి సురలచే
శ్రీవేంకటనరసింహుడు
దైవమై మమ్మేలి దాసుల రక్షించె
తావుకొనఁగ నిటు దయతోఁ జూచి