పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:286-02 వసంతం సం 03-495 వైరాగ్యచింత


పల్లవి :

నీ శరణమే గతి నే నితర మెరఁగ
పాశబంధముల పనులేలయ్యా


చ. 1:

పూఁచిన తొలుకర్మంబులు భోగించక పోవు
చాఁచుకున్నయీ శరీరగుణములు చాలునన్నఁ బోవు
రేఁచిన జననమరణములు రెంటికిఁ దీసీని
మోఁచివచ్చితే విజ్ఞాన మెరఁగఁగ మొదలికిఁ గొనకును యెడ యేదయ్యా


చ. 2:

కోరిన నా కోరికలు కొనసాగక పోవు
బారిఁ బడుచు కాలము దా బడిఁ దగులక పోదు
మేరతో పంచేంద్రియములు మెడచుట్టక పోవు
యే రీతుల సంసారము గెలువఁగ నెదురుబడిని బలిమిఁకనేదయ్యా


చ. 3:

మనసును వాకునుఁ జేఁతయు మానుమన్నఁ బోవు
తనువులోన నా యంతర్యామివి తలఁచక ఇఁకఁ బోదు
ఘనుఁడవు శ్రీవేంకటపతి నన్నుఁ గావక ఇఁకఁ బోదు
కనికానని యజ్ఞాన జంతువను కడమలెంచ నిఁకఁ గొలదేదయ్యా