పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0344-03 పళవంజరం సం: 04-258 కృష్ణ


పల్లవి :

వెఱపించబోయి తానె వెఱచెఁ దల్లి యశోద
మఱచి యీబాలు నెట్టు మానిసెంటా నుండెనో


చ. 1:

వెంట రాకుమని కృష్ణు వెరపించి యశోద
వొంటి మందలో గొంగ వున్నాఁడనె
అంటి గొంగ యెందునున్నాఁడని నోరు దెరచితే
పెంటలై బ్రహ్మాండాలు పెక్కు గానవచ్చెను


చ. 2:

చందమామఁ బాడి తల్లి సరిఁ బొత్తుకు రమ్మంటే
చందురుఁ జూచి కృష్ణుఁడు సన్నపేసెను
ముందరఁ జంద్రుఁడు వచ్చి మొక్కితే యశోద చూచి
ముందేలా యంటినో యని ముంచి వెరగందెను


చ. 3:

పాలార్చి తొట్టెలలోఁ బండఁబెట్టి యశోద
నీలవర్ణుఁ దొంగిచూచె నిద్దురో యని
వోలి శంఖచక్రాలతో నురము శ్రీసతితోడ
యీలీల శ్రీవేంకటేశుఁడై యున్నాఁడు