రేకు: ౦౦48-04 సామంతం సం: 01-296 వైరాగ్య చింత
పల్లవి:బలువగుకర్మము లివివో జీవులప్రారబ్దంబులు సంచితంబులును
బలిసి తీర వివి పెరుగనేకాని బ్రహ్మలబహుకల్పంబులదాఁక
చ.1:పాయనిజన్మంబులకర్మంబులు పాయక జీవుల ప్రారబ్ధములై
యేయెడఁజూచిన నెదిటికొలుచులై యిచ్చల నిటు భజియించఁగను
కాయపుఁ బెడతటిగండఁడు విధి, దనుఁగడ తేర్చిన తనకడకర్మములు
పోయి సంచితంబులఁ గలసిన, నవి పాదలుచుఁ గొండలపొ డవై పెరుగు
చ.2:పొదలి సంచితంబులు వడిఁబెరుగును పాలియును జీవునిపుణ్యముఁ జాలక
యెదిగినపుణ్యం బిగురును కాఁగినయినుముమీఁదిజలములవలెను
పదిలములై కడుఁబాపకర్మములే బరువై పరగఁగఁ బ్రాణికి నెన్నఁడు
తుదయు మొదలు నెందును లేక, వడిఁ దొలఁగక భవములతొడవై తిరుగు
చ.3:తలఁపులో నవయఁదలఁచినజంతువు, కలుషహరుఁడు వేంకటగిరిపతి దను
దలఁచుభాగ్య మాత్మకు నొసగినఁ, జిత్తము పరిపక్వంబై యెపుడు
జలజోదరుదలఁచఁగఁబ్రారబ్దంబులు సంచితంబులుఁ బొలసి పుణ్యులై
చెలువగునిత్యానందపదంబునఁ జెలఁగి సుఖించగఁ జేరుదు రపుడు