ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 0౦45-06 ముఖారిసం: 01-278 దశావతారములు
పల్లవి:అన్ని చోట్లఁ పరమాత్మ నీవు
యిన్నిరూపుల భ్రమయింతువుగా
చ.1:పాలజలనిధినుండి బదరీవనాన నుండి
ఆలయమై గయలోఁ బ్రయాగ నుండి
భూలోకనిధివై పురుషోత్తమాన నుండి
వేలసంఖ్యలరూపై విచ్చేతుగా
చ.2:వుత్తర మధురలో నయోధ్య లోపలినుండి
సత్ తైైన నందవ్రజాన నుండి
చిత్తగించి పంచవటి సింహాద్రిలోననుండి
వత్తుగా లోకములు పావనము సేయఁగను
చ.3:కైవల్యముననుండి కమలజలోకాన
మోవఁగ శ్రీరంగమున నుండి
యీవల నావల నుండి యీవేంకటాద్రిపై
నీవే నీవే వచ్చి నెలకొంటిగా