ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చ. | మనుజులు మందబుద్ధిఁ జని మానవనాథుల నాశ్రయించుచున్ | 65 |
భావం:
దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! దయచేసి ఈ మానవస్వభావాన్ని చిత్తగించు! కొందరు విద్యావంతులయిన మనుజులు బుద్ధిమాంద్యంతో రాజులను ఆశ్రయించి, వాళ్ల సభలలో శాస్త్రవాదాలు సలిపి, ఆ రాజులను మెప్పించి, వాళ్లు బహూకరించిన ధనాన్ని తెచ్చి, (తామనుభవింపక), తమ తనయులకొఱకని యుద్దేశించి, పిసినిగొట్టులై మార్మూలప్రదేశాల్లో భూమియందు దాచిపెట్టుతుంటారు. అల్లాగ ద్రవ్యంపై దురాశ అనే దుర్గుణం అలాంటి పండితుల్లో కూడా ముక్తిని గూర్చిన ఆలోచనను కలుగనీయదు కదా!