ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చ. | గురునకు నీ కభేదములు కోరి పఠించితినంచుఁ జిత్తమం | 42 |
భావం:
దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! సూర్యచంద్రులే నేత్రాలుగా గలిగిన పరాత్పరా! నాగురువర్యునకు నీకు అభేదాన్ని (ఈ శతకంలో ఆ యా చోట్ల) పాటించినానని నీమనస్సున కోపింపవలదు. నీ అపారకరుణచేతనే నేను నీదివ్యస్వరూపాన్ని సందర్శింప గలిగినాను కదా! కావున, నాగురువర్యుడవు నీవే! ఇందులో ఏమీ సందేహం లేదు! ఓ గురుస్వామీ! నీ శిష్యురాలైన నన్ను నీకృపావిశేషంతో కటాక్షించు!