ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉ. | జోడుగ నెల్లకాలమును సొంపుగ నా పరమాత్ముఁ డుండు మేల్ | 31 |
భావం:
దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! తొలుత చాలాకాలంగా ఆ పరమాత్ముడుండే ఉత్తమమైన ప్రదేశాన్ని చూచియున్నవాడై, ఆ మార్గం తెలిసినవాడై వుండి కూడా, ఈ జీవుడు ఇప్పుడు వేరొక మార్గంలో వెళ్లడానికి పూనుకొంటున్నాడు. ఆపరమేశ్వరుని జాడకు వెళ్లడానికి వీడెందులకో భయపడుతూవున్నాడు. ఈ జీవుని యొక్క ఇప్పటి ఈ కపటమైన ప్రవర్తన యేమిటో? ఎందులకో? నీవే ఆలోచించుమా! స్వామీ!