ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉ. | ముందటి దోవ గానకను, మూర్ఖులునై బలు జవ్వనంబునన్ | 101 |
భావం:
దయాసముద్రుడవయి తరిగొండలో వెలసియున్న శ్రీలక్ష్మీనరసింహదేవా! మూర్ఖజనులు కొందరు భవిష్యత్తులో తాము నడుచుకొనదగిన సన్మార్గాన్ని తెలిసికోలేనివారై, సుందరీమణులగు యువతులను గాంచి మనస్సులో కోరుకొంటూవుంటారు. ఆ యువతీమణులపై నిందలను సృష్టిస్తూవుంటారు. అలాగే ఎల్లవేళలా ఇతరులదోషాలను ఎన్నడంలోనే కాలం గడపుతూ, మలినబుద్ధులై, మనశ్శాంతి లేనివారై యుంటారు.
(అలాంటి కలుషితబుద్ధులను ఉద్ధరించగల్గిన ఉత్తమసదుపాయం తరిగొండ లక్ష్మీనృసింహుని యందలి భక్తి ఒక్కటే - అనేది సందేశసారాంశం).