పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

61

22. బహదాూర్‌ షా జఫర్‌

(1775- 1862)

భారతీయులలో ఆంగ్లేయుల పట్ల పెల్లుబికిన ఆగ్రహానికి ప్రతీక ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామం. ఆ మహత్తర చారిత్రాత్మక పోరాటానికి నాయకత్వం వహించిన ఖ్యాతిని సొంతం చేసుకుని, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ప్రత్యే క స్థానాన్ని పదిలం చేసుకున్న చివరి మొగల్‌ పాలకుడు బహదూర్‌ షా జఫర్‌.

బహదూర్‌ షా జఫర్‌ మొగల్‌ చక్రవర్తుల వరుసలోని 14వ చక్రవర్తి రెండవ అక్బర్‌ షా, ఆయన భార్య రాజపుత్ర వంశానికి చెందిన లాల్‌బాయిలకు 1775 అక్టోబరు 24న జన్మించారు. బహదూర్‌ షా జఫర్‌కు సాహిత్యం, కళల మీదఎక్కువ మక్కువ. విజ్ఞానార్జనతోపాటుగా పలు యుద్ధ విద్యలలో ఆయన సుశిక్షితులయ్యారు.

ఆంగ్లేయుల పెత్తనం అతిశయించడంతో అసంతృప్తిగా ఉన్నఆయన మీర్‌లో కంపెనీ అధికారుల మీద తిరగబడిన సైనికులు అక్కడ నుండి ఢిల్లీకి వచ్చి 1857 మే 11న ఢిల్లీ ఎర్రకోటలోకి ప్రవేశించడంతో ఆయన కేంద్రంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఊపందుకుంది. ఆయన మే 12న దర్బారు నిర్వహించి, చక్రవర్తి హోదాలో పలు నియామకాలు చేస్తూ ఆంగ్లేయుల మీద జఫర్‌ యుద్ధం ప్రకటించారు.

ఆ తరువాత మహా పరిపాలనా వ్యవహార మండలిని ఏర్పాటు చేశారు. హిందూ-

చిరస్మ రణీయులు