Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రథంబు వేగంబునం బఱపించి తనసేనకుం జెయివీచి యోడ
కుం డని నిలువరించు నవసరంబుఁ బ్రొద్దు గ్రుంకె నంతక
మున్న యర్జునుండు తమసైన్యంబులం దివియించి భీష్మ
ద్రోణకృపాశ్వత్థామధర్మజసుయోధనకర్ణాదులుఁ దానును
గరదీపికాసహస్రంబులు వెలుంగ నిజస్కంధావారంబున
కుం జని సముచితప్రకారంబున నందఱ ననిపి మజ్జనభోజనా
దులు సల్పి సుఖంబున నుండె నంత నిక్కడ.

156


ఉ.

సీరియు మాధవుండు హతశేషవరూథినితోడఁ గూడి య
క్రూరుని యుద్ధవుం దలఁచి కుందుచుఁ బాండుతనూజసేనపై
వైరము మిక్కుటంబుగ నివాసము చేరఁగఁబోయి మందిర
ద్వారమునందు నిల్పి పరివారము నంపి యథోచితంబుగన్.

157


వ.

అన్నపానాదికృత్యంబుల
నిర్వర్తించి యెప్పుడెప్పుడు
సూర్యోదయం బయ్యెడు నని రణకుతూహలాయత్తచిత్తు
లై యుండి రయ్యుభయబలంబులు తమతమశిబిరంబుల
కరుగంజూచి దేవతలు దివంబునకుం జనిరని శుకయోగీం
ద్రుం డిలావంతునకుం జెప్పె నని చెప్పిన నటమీఁది
వృత్తాంతం బేమని యడుగుటయు.

158


మ.

శతపత్రోద్భవవంశపావనదయా సత్యాన్వితస్వాంతసం
తతగోకాంచన ఘోటకాంబరధరాధాన్యాదిదానాఢ్య యూ
ర్జితనానావనదేవతాగృహధరిత్రీదేవకళ్యాణ శా
వ్యతటాకోరునిధానసంతత సమగ్రైశ్వర్యభాగ్యోన్నతా.

159


క.

దుర్మంత్రివదనముద్రా
కర్మఠ దుగ్ధాబ్ధికన్యకాధవపూజా