Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆయుగ్రసేను రథికుల
వేయివిధంబులఁ గలంచి విగతాసులుగాఁ
జేయుచు బాహ్లికనందనుఁ
డాయోధనభీష్మమూర్తియై తను నొంపన్.

141


తే.

నూఱుతూపులఁ జేకితానుండు సోమ
దత్తుపై నేసె నతఁడు చే యెత్తకుండ
మఱియుఁ బిడుగున కెనయైనమార్గణమున
నలిగి యేసిన నవ్వీరుఁ డవనిఁ గూలె.

142


వ.

ఇట్లు సోమదత్తుండు పడిన.

143


తే.

పార్థుసేనలు దుఃఖవిభ్రాంతిఁ బొందె
హరివరూథిని సంతోష మడరి యార్చె
నది గనుంగొని మత్స్యేంద్రుఁ డలుకతోడ
నుద్ధవునిఁ దాఁకి యేసె శరోత్కరమున.

144


క.

ఆతఁ డవి నడుమఁ జడియుచు
భూతల మగలంగ నొక్కభూరితరాస్త్రం
బాతనిపై నిగుడించిన
భూతము లార్వంగఁ దనువు బోరన విడిచెన్.

145


వ.

ఇవ్విధంబున మత్స్యమహీనాయకుండగు విరాటుండు
దెగినఁ దద్బలంబులు హాహానినాదంబు గావించె నయ్యాదవ
నాయకుబలంబులు సింహనాదం బొనరించె నంతం బాం
చాలపతి క్రుద్ధుండై యుద్ధవునిపై శరపరంపరలు పరఁగిం
చిన నతండును దోడ్తోన వారించె నయ్యవసరంబున
ద్రుపదుండు.

146