Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తునియలై కీలుదప్పిన బొమ్మలచందంబునం గూలు రాహు
త్తులును నంకుశాఘాతకుపితంబు లై యొండొంటి మర్మం
బులు గాడ దంతాదంతిం బోరి మావంతులతోడఁ బీనుంగు
లైన యేనుంగులును, సారథులు రవడించి యుగ్యంబుల
పగ్గంబులు వదలి కదియఁ ద్రోలినఁ బరస్పరబాణఘట్టనల
రథంబులు తిలప్రమాణఖండంబు లై దొఱఁగిన విరథులై
కరవాలంబులుం బలుకలుం గొని యోలమాసగొనక యొం
డొరుం డాసియు వ్రేసియుఁ దప్పించియుం గుప్పించియుఁ
బోరిపోరి పొలిసిన రథికులుం గలిగి యాసందడి కయ్యంబు
భయంకరంబై యుండె నంత.

74


ఉ.

వాసవనందనుం గడచివచ్చి వికర్ణుఁడు దోడు గాఁగ చు
శ్శాసనుఁ డేచి సాంబుని నిశాతశరంబుల నేయ నవ్విభుం
డీసును మచ్చరంబు మడి హెచ్చఁగఁ గృష్ణుఁడు మెచ్చ నార్చి యు
ల్లాసముతోడ వాఁడి దెరల న్విశిఖంబుల నొంచి వెండియున్.

75


క.

శరముల రెంట వికర్ణుని
తురగంబుల నొంచి పడగఁ దొమ్మిదితూపు
ల్వఱపి పొడి చేసి సారథి
నురువడి నొకకోలచేత నుక్కడఁగించెన్.

76


ఉ.

అత్తఱి దుస్ససేనుఁడు రయంబునఁ దీవ్రశరంబుచేత వీ
రోత్తము సాంబు నొంచి మఱియుం బదునేనుమెఱుంగుటమ్ము లు
వ్వెత్తున సారథిం దగులనేసి తెరల్చినఁ గృష్ణనందనుం
డొత్తిలి శాతబాణమున నొక్కట నేసె నతండు మూర్ఛిలన్.

77