Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్షోణీనాథులుఁ బోరనిల్వఁగ బిడౌజుండో యజుండో [1]కడున్
వేణుధ్వానముఁ జేసి [2]గొల్లసతులన్ వేఁగూడుటో కయ్యముల్.

63


వ.

కావున బహుశాస్త్రజ్ఞుండవగు నీవు మీకృష్ణునకు బుద్ధిఁ
జెప్పి యా చతుర్ధనుఁ జంపెదనన్న ప్రతిన మాన్పించు
మనవుడు నక్రూరుం డతని కిట్లనియె.

64


తే.

రాజ్యగర్వంబు పెంపున రాజరాజ
మీఁదు గానక యాడితి మిన్న కీవు
సత్యసంకల్పుఁడైన యాచక్రపాణి
ప్రతిన మాన్పెదనని పూన బ్రహ్మతరమె.

65


చ.

సురల జయించి దేవపురి చూఱలుపట్టి సమస్తలోకములో
పొరిఁబొరినేర్చు నయ్యసురపుంగవకోటుల మాటమాత్రలో
శరములపాలు చేసి దివిషద్వరుబెల్ల నుతింపఁబొల్చు నా
హరికిని మీకు హస్తిమశకాంతర మారసి చూడ నెమ్మెయిన్.

66


వ.

మఱియును.

67


సీ.

కల్పాంతశిఖకల్ప[3]కాళియఫణములఁ
             జిదమిదగా మట్టి మద మడంచె
సత్వనిర్జితదిశాసామజశ్రేష్ఠంబుఁ
             గువలయాపీడంబు నవనిఁ గూల్చె
విశ్వలోకాప్రతివీరుఁ జాణూరుని
             బాహుయుద్ధంబునఁ బట్టి చంపె
బంధురబలు జరాసంధుఁ బద్నెనిమిది
             మాఱులు రణభూమిఁ బాఱఁదోలె

  1. కదా
  2. గొల్లెతలలో వేయాడుటే
  3. కాళియుఁ బదముల