Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

ధర్మతనయ నీకుఁ దగునె బేలవుఁబోలె
వాఁడిఁ జేసి యిట్లు నేఁడు పలుక
యాదవేంద్రుసత్వమంతయు మన మెఱుం
గుదుముగాదె [1]గెలువఁగూడు ననిన.

21


వ.

కర్ణుం డిట్లనియె.

22


ఉ.

అర్జునునంతవాఁ డితని నాదరణంబునఁ గావఁబూనె నా
నిర్జరు లెల్ల వచ్చి ధరణీవరకోటులఁ గూడి విక్రమ
స్ఫూర్జితమూర్తులై యనికిఁ జొచ్చిన వీని వధింప శక్తులే
కర్జమునం దలుప నల కంజదళాక్షునిఁ జెప్ప నేటికిన్.

23


వ.

అనిన దుర్యోధనుం డిట్లనియె.

24


మ.

వనజాక్షుండన నెంత చాపగురుఁ డశ్వత్థామయున్ గౌతముం
డును మీ రేవురు నేను బాహ్లికుఁడుఁ గర్ణుండున్ మదీయానుజుల్
ఘను లీరాజులు భీమజాద్యసురులున్ గంగాసుతుం డాదిగా
మనసైన్యంబులు గూడి పొల్చిన రణక్ష్మామండలి న్నిల్చునే.

25


వ.

అని మఱియు వీరాలాపంబు లాడి శరణాగతుండగు నీ
చతుర్ధనుం గావంబూనిన యర్జునుప్రతిజ్ఞ[2]తోన నడరు
నని నిశ్చయంబుగాఁ బల్కిన యనంతరంబ దుశ్శాసనుం
డిట్లనియె.

26


చ.

మనము సమస్తభూవరసమాజము సేనలతోడఁ గూడి రాఁ
బనుపుద మంత నాధరణిపాలురు వచ్చిన సైన్యరాజితోఁ
గినుక దలిర్ప ద్వారవతికిం జని వేడెలు వెట్టి యాచతు

  1. మేలుగూడు ననిన
  2. నెగడెడునని