Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కేయునకు వందనం బాచరించి తనకు నెఱఁగిన దుర్యోధ
నాదికుమారులను దక్కిన రాజవరుల నాలింగనసంభా
షణాద్యుపచారంబులఁ గారవించి కనకపీఠికాసీనుండై
యందఱ నుచితాసనంబులఁ గూర్చుండ నియమించి తత్త
దుచితప్రకారంబున సంభావించుచున్న యవసరంబున
నచ్చతుర్దనుం డచ్చీఁకుఱేనికి నమస్కరించిన.

14


క.

ఆనరనాయకుఁ గౌరవ
భూనాథుం డెత్తి ధర్మపుత్త్రునితో నీ
మాననపతి యెవ్వం డిట
రా నేమికతంబు గలిగెఁ గ్రమమునఁ జెపుమా.

15


క.

నావుడు ధర్మజుఁ డక్కురు
భూవరునకు నెడ్డఁ గరుణ పొడమఁ బలికె నా
దేవవ్రతునకుఁ జెప్పిన
ఠేవన్ నరుపూన్కి రాజు డెప్పరముఁ దగన్.

16


వ.

ఇట్లు దెలిపి.

17


తే.

అర్జునుప్రతిజ్ఞతోఁగూడ నవనినాథ
యితనిఁ బాలింపు మిందుకై యిచట కేగు
చెంచినాఁ డిట్టి కర్జంబు దేవవాహి
నీసుతుఁడు వీనిఁ బ్రోవఁగనే తలంచె.

18


క.

మీమనమున నిక్కార్యం
బేమని తలఁచితి రన న్నరేంద్రుఁడు కృపతో
నీమనము గల్గియుండఁగ
నీమనుజేశ్వరునిఁ గావ నెంతనె నాలోన్.

19


వ.

శకుని కర్ణ దుర్యోధన దుశ్శాసనులుఁ దమలో విచారించి
హర్షించి రందు శకుని ధర్మజున కిట్లనియె.

20