Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

[1]బ్రహ్మదేవుని యంతవాఁడును వనభూమి
             మాయ సేయఁగఁబోయి మాయఁబడియె
వామదేవుని యంతవాఁడును నిజభక్తుఁ
             గాపాడఁబోయి దా గాసిఁబడియె
వరుణుని యంతటివాఁడును నిజభటా
             నీతార్భకు నొసంగి నిలిచి పొగడె
వాసవు నంతటివాఁడును సంగర
             స్థలమున నెదిరించి [2]చాలఁ దూలె


తే.

మఱియుఁ దక్కటి రిపువీరమండలంబు
పిలుకుమారె సరోజాక్షుపెంపుచేత
నరుఁడ నాకథ యెంత భండనమునందు
నిలువఁగలనే, యటంచు వెండియు నతండు.

203


వ.

తనమనంబున నిట్లని వితర్కించె.

204


క.

తన తనువు నిలుపుకంటెన్
దనమాట నిజంబుఁ జేయఁదగు ధీరులకున్

  1. వనరుహోద్భవునంతవాఁడు బాలకవత్స
                 ముల దాఁచి తనయంత మోసపోయె;
    వాసవునంతటివాఁడును సంగర
                 స్థలమున నెదిరించి ధరణిఁ గూలె;
    వేఁడిచూపఱియంతవాఁడు బాణాసుర
                 యుద్ధంబులోపల నోసరిల్లె;
    వసుధాసుతునియంతవాఁడును సంగర
                 స్థలమున సేదిరించి ధరణిఁ గూలె;
  2. ధరణిఁ దూలె