Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గోమలనూతనస్వరముఁ గ్రోలుచు కోయిలపిల్లయో యనన్.

94


తే.

ఏడ్చి యాసత్య హరితోడ నింద్రుదేవి
పారిజాతమహీజపుష్పముల నీయ
దయ్యె మానవకాంత వీ వనుచు నన్ను
నేవగింపుచుఁ దానే వహించె ననిన.

95


ఉ.

ఆరమణీశిరోమణిఁ బ్రియంబునఁ గౌఁగిటఁ జేర్చి కంటినీ
రారిచి చిక్కువడ్డకురు లల్లన కొప్పున దోపి యక్కునం
బేరులు చక్కదిద్ది వలిపెంబు చనుంగవఁ గేలఁ గొల్ఫి యం
భోరుహపత్రలోచనుఁడు మోము గరంబున నెత్తి యిట్లనున్.

96


క.

మానవసతివని ని న్నవ
మానము గావించి శచి సుమము లీదయ్యెం
గా నీకుఁ? బారిజాతం
బే నీయుద్యానవీథిఁ బెట్టెద ననుచున్.

97


చ.

హరి పెకలించి తెచ్చి విహగాధిపుపై నిడియె న్ముదంబునన్
స్మరహరమౌళిచంద్రసహజాతము బంధురగంధలుబ్ధష
ట్చరణపరీతమున్ సతతసత్ఫలపోషితదేవజాతమున్
దరుణఫలాశపుష్పసముదాయసమేతముఁ బారిజాతమున్.

98


వ.

ఇట్లు పారిజాతం బవహరించి సత్యభామాసమేతుండై గరుడ
గరు దుద్భూతవాతపరాభూతమేఘవ్రాతుండై చనునెడ.

99


శా.

నావారందఱుఁ గూడి యొక్కమొగమై నానాస్త్రసంతానముల్
వైవన్ వారల లెక్కఁబెట్టక ప్రభావస్ఫూర్తి శోభిల్లఁగా
వేవేగంబున శంఖ మొత్తిన భయావిద్దాత్ములై పాఱిరే