పుట:కుమారసంభవము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

45


క॥

విని కాని యెన్నడును నినుఁ । గని యెఱుఁగరు హరిసరోజగర్భామరస
న్మును లిట్టి నీస్వరూపముఁ । గని యియ్యెడఁ బాసిపోవగా నోపుదునే.

343


వ॥

అని కరంబులు మొగిచి దీనాననుండై యున్నవానిభక్తియుక్తికిం గరుణించి సక
లలోకాభీష్టఫలవృద్ధికేదారాత్మకుం డగుట, గేదారేశ్వరుం డన నిప్పురంబున
వసియించెద నోడకుండు మనిన దానికిం బ్రసాదం బని.

344


సీ॥

ఈబాల దన్నుఁ దా నెఱిఁగికోలె ననన్యశరణ్యయై యహరహంబు
నిన్న కొల్చుచుముందు నీ విందు మాపుణ్యమునంజేసి వచ్చుట విని ముదమునఁ
జూడంగ వచ్చె నిన్ జూచినకోలె భక్తావేశమునఁజేసి జీవ మెడలఁ
బాసిన మీపొందు వాయనోపదు పాసి తలరుఁ గావున నిచ్చఁ దగినవరువుఁ
బనులు సేయుచుండుఁ బార్వతియునికికి వరద యిచ్చగింపవలయు ననిన
నతనివిన్నపమున నంతకు భక్తవత్సలుఁడు నెమ్మనమున సంతసించి.

345


వ॥

అదత్తప్రతివచనుండైన దానికి మహాప్రసాదం బని యనేకమాణిక్యాకల్పలేపాంబ
రాలంకృతం బైనకన్యాంతఃపురంబులోన.

346


క॥

అక్షితధరపతి శివుఁ బ్ర । త్యక్షముగాఁ గొలుచుచుండు మని తత్పరుఁడై
శిక్షించి గౌరి నందు సు । రక్షితముగ నునిచి నిజపురంబున కరిగెన్.

347


వ॥

అంతం బార్వతియు నీశ్వరారాధనాసక్తయుక్తయై భక్తియు ననురక్తియు నంత
కంత కగ్గలించుచుండ.

348


సీ॥

చమరీజబర్హమార్జనులఁ బరీక్షించి నయమున సమ్మార్జనంబు సేయుఁ
గర్పూరతైలార్ద్రకస్తూరికాకర్దమంబుల ననులేపనంబు సేయుఁ
గాశ్మీరమాంజిష్ఠగరుడాండహరినీలముక్తాఫలంబుల మ్రుగ్గు వెట్టుఁ
గుసుమపల్లవలతాకోరకంబులఁ జిత్రదామంబు లొనరించుఁ దావిమిగులఁ
బుష్పమందిర మొనరించుఁ బుణ్యవారి । సౌరభము లించి మణికలశముల నించు
నచలపతిసుత మది నిట్టు లహరహంబు । శివున కనురక్తిఁ బరిచర్య సేయుచుండె.

349


చ॥

పొలుపుగఁ జంద్రశేఖరుతపోవన మంగజచక్రవర్తిదో
ర్బలమున ముట్టి చూఱగొనఁ బంచినదం డొకొ నాఁగఁ బొల్చి క