పుట:కుమారసంభవము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

శ్రీకంఠమూర్తిఁ బుణ్య । శ్లోకు మహాభాగు నిఖిలలోకారాధ్యున్
నాకేశభోగిసత్యగు । ణాకరు నచలాత్ము మల్లికార్జునదేవున్.

136


మ॥

అతినీలాభ్రవిలంబియై పొలుచునీహారాద్రియుం బోలె స
త్సుతు సాయోద్భవక్త్రు నెత్తికొని సంతోషంబుతోఁ జూచుచున్
సతి నవ్వించుచు నవ్వుచున్నపరమున్ సర్వేశు దక్షప్రజా
పతి గాంచెన్ సితహాప్రభావిచలితబ్రహ్మాండభాండోదరున్.

137


వ॥

కని సర్వాంగాలింగితమహీతలపునఃపునఃప్రణామసంస్తోత్రాదిసత్కారంబులు
సేయక దురభిమానంబున నహంకరించి యున్న దక్షునిం గని విరూపాక్షుం
డాక్షేపించి విముఖుం డైనం గని దక్షుండు దనుయల్లురందఱ చేసివసత్కారం
బులును మొదలియల్లుం డైనపరమేశ్వరుండు సేయమికి మనఃక్షుభితుండై క్రమ్మ
ఱ నిజనివాసంబున కరిగి తద్వృత్తాంతం బాత్మేశ్వరి కెఱింగించి మనఃఖేదంబున
నున్నదక్షప్రజాపతికిఁ దద్ధర్మపత్ని యిట్లనియె.

138


గీ॥

తల్లిదండ్రులఁ బూజించి తగ వెఱింగి । మన్నపొడ వైననే యత్తమామ లనియె!
ప్రియ మెఱుంగు నాఁడిచ్చినబిడ్డ మనకుఁ । బాసె నని యుండుఁ డింక నాపలుకు లేల.

139


వ॥

అనిన వెండియు నవమానానలోద్దీపితమనస్తాపంబు సహింపనోపక తదపకారం
బునకుం బ్రత్యపకారంబు సేయ నుద్యుక్తుండై యిట్లనియె.

140


తరు॥

భువనంబు లన్నియుఁ బుట్టించి కశ్యపుఁడు వానిఁ గైకొని బ్రోచుచంద్రుండు
నవయవంబుల వాని నడచు ధర్ముండు నతిభక్తి నా కిచ్చె నర్చన లర్థి
నివి వారిలోనఁ దానే వెద్దపొంది యీశానుఁ డేఁ దనయింటికిఁ జన్న
నవమాన్యుఁ జేసె నాయల్లురు నేను నై తన్ను జేయుదు నాగమబాహ్యు.

141


వ॥

అని విచారించి కృతనిశ్చయుండై మహాధ్వరప్రారంభాభిముఖుండై చతుర్దశ
భువనాంతరానేకజనంబుల రావించినం దదీయాజ్ఞాప్రేరితులై.

142