పుట:కాశీమజిలీకథలు -09.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగన్మోహనుని కథ

103

తేజోరాసులా! అగ్నిజ్వాలలా? యంత్రములా? అవి యన్నియు నొక్కచోట నున్నవియా? దూరదూరముగా నున్నవియా?

గురు - రాజపుత్రా ! విను మవి యన్నియు గోళములు. పరస్పరసంబంధము గలిగియున్నవి. అన్యోన్యాశ్రయత్వము వలనఁ దిరుగుచున్నవి.

రాజ - ఎక్కడ ! దిరుగుచున్నవి ?

గురు - భూమిచుట్టును, మేరువుచుట్టును.

రాజ -- గోళములన నేమి?

గురు - గుండ్రముగా నుండునని గోళములనంబడును గదా?

రాజ - భూమివలె నవియు గుండ్రముగా నుండునని చెప్పుచున్నారు. సరియే. అందు మనుష్యులుగాని, జంతువులుకాని యుందురా.

గురు – అవి యన్నియుఁ బుణ్యలోకములని పురుణగాథలు సెప్పుచున్నవి.

రాజ - పురాణకథలకును సత్యమునకును జాల దూరమున్నది. సాయంకాలమున సూర్యరథమునకు మందేహాసురు లడ్డము వత్తురనియు నప్పుడు విప్రు లిచ్చు నర్ఘ ప్రదానతోయము వజ్రాయుధమయి వారిని దూరముగాఁ ద్రోసివేయుననియుఁ బురాణములలో గాక వేదమందుఁ గూడఁగలదు. ఆమాట సత్యమా?

గురు - సత్యము కాదందురా, యేమి?

రాజ - వయస్యా! నీవు చెప్పుము.

సిద్ధా - అయ్యా! అస్తమయము, సూర్యున కున్నదా? సర్వదా యుదయించుచు సర్వదా యస్తమించునట్లు మనకుఁ గనంబడునుగాని సూర్యున కుదయాస్తమయము లున్నవియా? మరి మందేహాసురు లెప్పుడువత్తురు. సంతతము వచ్చుచుండవలయు నిది ప్రత్యక్షమునకు విరుద్దముకాదా?

గురు - ఓహో! అదియా? మీరు చేసినశంక. పోనిండు. పురాణములలో గొంత యసత్యముండవచ్చును. దీని విషయమయి మీ రేమందురు?

రాజ - ఆచార్యా! ఈ కుశ్శంకలకేమి కాని నాకానక్షత్రముల కడకు బోయి యందలి విషయములు కన్నులార చూడవలయునని యున్నది. నామనోరథ మెట్లుతీరును?

గురు -- ఈ మనుష్యదేహముతో జూచుట శక్యముకాదు.

రాజ -- భూలోకమే ప్రధానలోకమగును సూర్యచంద్రాదులు భూలోకసంరక్షణకొఱకే సృజించినట్లు కనంబడుచున్నది. చూచితిరా?

గురు - అవును. అట్లే కనంబడును.

రాజ --- ఆ లోకములన్నియు మనుష్యుల కొఱకే నిర్మింపబడినవియా?