పుట:కాశీమజిలీకథలు -09.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మలయవతి వివాహము కథ

239

పనియే దేనిఁ గలిగిన వక్కాణింపుము చేసి కృతజ్ఞుండనయ్యెదనని యడిగిన మదనమంజరి యిట్లనియె.

మహాత్మా! నీవు నాకుఁ గావింపవలసిన యుపకార మిదివఱకే చేసి యుంటివి. అందులకు నీకు నేను బ్రతిక్రియ యేమియుఁ జేయజాలను. అది యట్లుండె నా మనసున వేఱొక కోరిక యున్నది. వరమిచ్చితి కావున నడుగుచుంటి. నాయక్క కూఁతురు త్రిపురసుందరి యను సుందరి యున్నది. దానిఁ ద్రిభువ సుందరి యనియే చెప్పఁదగినది దాని మీకుఁ ద్వితీయ సేవకురాలిగాఁ జేయదలంచుకొంటి నంగీకరింప వలయునని గోరినఁ జిరునగవుతో నతండు మలయవతి మొగముజూచెను. మలయవతి కేలుమోడ్చి మహాత్మా! అట్లు చేయుట నా కెంతయు నభిమతము. తన కూఁతును విడిచి నాకు మహిషిపదం బొనఁమార్చిన యామె కోరికఁ దీర్చుటకంటె యుత్తమకార్య మేమియున్నది? దేవతాబంధుత్వప్రాప్తిఁ జేసి నూత్నవిశేషంబుల దెలిసికొను భాగ్యము గూడఁ బట్టును. అన్ని విధముల నిప్పని సమంజసమై యున్నదని చెప్పి యతనికి సంతోషము గలుగఁజేసినది.

మదనమంజరియు పుష్పమంజరుల వారిపై జల్లి నే నిప్పుడు బోయివచ్చెద . వెండియు నుజ్జయినీపురంబునం గలిసికొనియెద. ననుజ్ఞయిండని చెప్పి యలకాపురంబున కరిగినది.

విక్రమాదిత్యుడును మలయవతితో ననంగల్పోక్తప్రకారంబున శృంగారకేళీవ్రతానుష్ఠానతత్పరుండై కొన్నిదినంబు లందుండి పిమ్మట నా పొన్ని కొమ్మను వెంటబెట్టుకొని నిజపరిజనము సేవింపఁ గ్రమ్మర నుజ్జయినీ పురంబున కరుదెంచెను.

అని యెఱింగించుట వఱకుఁ గాలాతీతమైనది. తరువాత నగు వృత్తాంత మవ్వలి మజిలీయం దిట్లు చెప్పఁదొడంగెను.

203 వ మజిలీ

బంగారుస్థంభముకథ

శ్లో॥ అరుణ శిఖరిగంగాస్థంభమార్గేణగత్వా
     ప్రతిదిన మతి మాత్రస్వర్ణదాంకర్ణం భూషాం
     భరకిరణ సకాశాత్ ప్రాప్యతాం బ్రాహ్మణాయ
     వ్యతరదతిదరిద్రాయేతి సైపాప్యసక్తి

క. పుడమి నెటనైన గానీ
   కడుచిత్రంబైన వార్త గలదని విన్నం
   దడయక నటకేగుచు న
   ----------- డది చూచి వచ్చు నుత్సాహముతోడన్.

విక్రమాదిత్యుండు నిత్యము వివిధ చిత్రవార్త శ్రవణమునకై మహాకాళినాథుని యాలయమునకుఁ బోయి రెండు గంటల కాలము వసించియుండును. అప్పుడు