పుట:కాశీమజిలీకథలు -09.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23]

పిశాచలోకము కథ

177

మరణసమయంబున నా మోహనుడే పతి కావలెనని ప్రార్థించినది. గంగాగర్భమరణసుకృతంబునం జేసి యది యప్సరోలోకమున కేగినది. మీరే దానికి తీర్థశుల్కాధికార మిచ్చితిరి. మఱియు,

సీ. బ్రహ్మచర్యం బొక్కరాత్రి దై వికముగ
             మరచి తప్పినయట్టి మాసకమ్మ
    కలకాలమెల్లను గామిక వ్రతములు
             సలిపినట్టి చకోర శాబనయన
    బలిమి నొక్కనికి లోబడి వాని నెవ్వేళ
             బతిగా దలంచిన పద్మగంధి
    పురుషుండు లేని యప్పుడు ప్రమాదంబున
            మోసపోయిన యట్టి ముద్దరాలు
గీ. మాంత్రికుండైన నొక సిద్ధమౌని నొండె
    నొక్కవేలుపు నొండె ప్రియుండు పనుప
    బుత్రసంతానలబ్దికై పొందినట్టి
    యంబుజానన యచ్చరయై జనించు.

అని కాశీఖండంబునం జెప్పబడియున్నది. అది యట్లుండె చంద్రిక యను రాజపుత్రిక యా మోహనునే వరించి వానివెంటబోవుచు గంగలోబడి మృతి నొందునప్పుడు దానివలె వాడే తనకు భర్త గావలయునని తలంచినది. తత్సుకృతంబున సద్యోగర్భంబున నాకు బట్టిగా బుట్టినది వారిద్దరికోరికల ప్రకారము మోహనునికి బుణ్యలోకగమనాధికారము గలిగినది. ఆ కాంతలు వానింగాక నితరుల నెట్లు వరింతురు. ఆ కన్యలకు జాతిస్మరణము గలిగియున్నది. నేను నా పుత్రికకు స్వయంవరము జాటించితిని. దేవయోనివిశేషు లందరువచ్చిరి. అది యెవ్వరిని వరింపక దైవికముగా నాసభకు వచ్చియున్న మోహనుని వరించినది.

అందులకు నేనేమి చేయుదును? నిర్బంధించి యడుగ దన ప్రాక్తనజన్మవృత్తాంతము జెప్పినది. దానంజేసి నేను నానందనను వానికే బెండ్లిజేసితిని. కాశీగంగాప్రభావప్రక్రియలకు మనము విధేయులమై యుండవలయుంగదా. మనయధికారములు వాని నతిక్రమింపజాలవు. ఈ సంబంధము లన్నియు మీకెఱిగించి మాయల్లునకు నమృతము యాచించునిమిత్తము మీకడ కరుదెంచితిని. పాలకొఱకు దాతిని మోయవలయుం గదా. వీడు నా యల్లునిమిత్రుడగుట సత్యము. మోహనునకుంబోలె దనకుగూడ దివ్యబోగములు గలుగునని సిద్ధు నాశ్రయించి యిందు వచ్చెను. లాభము లేకపోవుటయేగాక గట్టి పరాభవము జరిగినది.

గీ. ఎవని యదృష్టమెట్లో యదియే లభియించెనుగాదె వానికిం
    దివమున కేగినన్ శతధృతింబరికించిన నిప్డుఁ జాచినం