పుట:కాశీమజిలీకథలు -09.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

తెలియకున్నది. ఒక్కసారియైనఁ గంగలో మునింగి విశ్వేశ్వరు నర్చింపరాదా! కానిమ్ము. అది పూర్వపుణ్యవిశేషంబునం బట్టి యుండును అని మఱియు నిట్లనియె.

రాజపుత్రా! నీ యిరువుర భార్యలను వెంట బెట్టుకొని భూలోకంబునకుం బోయెదవా? ఇందే యుండెదవా? నీ యభిప్రాయమేమని యడిగిన నే నత్యంతసంతోషము జెందుచు వందనపూర్వకముగా నిట్లంటి.

మహాత్మా! దేవలోకము లెట్టివైనను పుట్టిన దేశమం దభిమాన ముండకపోదు. నానిమిత్తమై జననీజనకులు పరితపించుచుందురు. మిత్రులు విచారించుచుందురు. మీ లోకమున కప్పుడప్పుడు వచ్చున ట్లనుగ్రహింపుఁడు. మీ కూఁతురు విద్యావతి యిందే యుండగలదు. నేను బోయివచ్చెద నానతీయుఁడు అని వేడికొనిన నతం డోహో! అది యట్లంగీకరించునా? ఆ మాట నే నిదివరకే చెప్పితిని. ఒప్పుకొన్నదికాదు. నీతో భూలోకమునకు వచ్చునఁట. ఈ వాద మంతయు నింతకుముందు మా యింట జరిగినది. సరే నీ విప్పు డీ యిద్దరి భార్యలతో భూలోకమునకు బొమ్ము. దక్షిణనాయకుండవై సుఖింపుము. వలయునప్పుడు వచ్చునట్లు విద్యావతికి చెప్పి పుచ్చెద నట్లు చేయుచుండుము. నీవు చూడ నాదిత్యునివలె నిత్యయౌవనుఁడవు చిరకాలజీవివి యగునట్లు దేవేంద్రు నడిగి యమృతము సంపాదించి యంపెదను. నియమితచిత్తుండవై దానిం ద్రావుము. అని బోధించిన విని మహాప్రసాదంబని యమ్మాటల కంగీకరించితిని. మఱియు వారి యనుమతిఁ బదిదినంబులందు విద్యావతితో దివ్యోపభోగసుఖంబు లనుభవించితిని.

మఱియొకనాఁ డా సోకులఱేడు కనకరత్నప్రబాథగద్దగితమై కాంచనకేతువిరాజమానమై కింకిణీఘంటారవమనోహరమై యొప్పునొక్క విమానంబు దెప్పించి మమ్ము రప్పించి యందుఁ గూర్చుండంజేసి యెందు బోదలతురని యడిగిన నే నిట్లంటి.

ఉ. ఏమహనీయ పట్టణ సమిద్ద మహత్వమునన్ లభించె మా
    కీముద, మెందు విశ్వపతి యిందు కళా మకుటుండు నన్న పూ
    ర్ణామదిరాక్షితో బుధజనంబుల కోరిక లిచ్చుచుండు, నే
    గ్రామము పొంతఁబారు సురగంగ మహాఘ విభంగ యేపురీ
    సీమ నొడల్ త్యజింతురు భజింతురు లోకసుంద రా
    రామమణీగృహాంతరవిరాజితసౌరవధూకుచోపగూ
    ఢామితభోగభాగ్యముల నట్టి మహోజ్వలరాశి కాశి సు
    శ్రీ మణికర్ణికాతటముచెంత వసింపఁగ జేయవే మమున్.

అని కోరుటయు నద్దనుజకులభూషణుండు మమ్ముందు దింపి రమ్మని యిరువుర కింకరుల కాజ్ఞాపించుటయు వారు విమానము నుగ్గరంబున నిలువంబడి భూమికి దింపుచున్న సమయంబున౼